Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్తీక్రెడ్డి.. నువ్వు తప్పుకుంటావా?
- మాజీ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ సవాల్
నవతెలంగాణ - రాజేంద్రనగర్
'ముందస్తు ఎన్నికల్లో ఓటమిపాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, కాంగ్రెస్ నేత కార్తీక్రెడ్డి ఓటమిపాలైతే తప్పుకోవాలి'' అని రాజేంద్రగనర్ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ సవాల్ విసిరారు. స్థానిక మైలార్దేవ్పల్లిలో ప్రకాష్గౌడ్ యువసేన అధ్యక్షుడు రాముగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పాటల సీడీని ఆయన మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ నేత కార్తీక్రెడ్డి తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. 200 ఎకరాల స్థలం కబ్జా చేశానని ఆరోపిస్తున్న కార్తీక్రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే రుజువు చేయాలని సవాల్ విసిరారు. సబితాఇంద్రారెడ్డి హోంమంత్రిగా పని చేసిన కాలంలో రాజేంద్రనగర్లో అభివృద్ధి పనులు కేవలం శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని 90 శాతం ఇండ్లకు ఇంటింటికీ తాగునీరందించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కేవలం ఎన్నికల సమయంలో కనిపించే కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోట అని, ఇతరులకు ఇక్కడ డిపాజిట్లు దక్కవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టీ.ప్రేమ్దాస్గౌడ్, మల్లేష్, చంద్రారెడ్డి, వెంకటేష్, వనం శ్రీరామ్రెడ్డి, కాశిగారి యాదగిరి, బుచ్చయ్య, శ్రీనివాస్గుప్త పాల్గొన్నారు.