Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటికీ ఖరారు కానీ అభ్యర్థులు
- గతంలో గట్టి పోటీనిచ్చిన టీడీపీ అభ్యర్థి
చార్మినార్ నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోట. సెగ్మెంట్ ప్రారంభం నుంచి ఇక్కడ గెలుపొందడానికి మజ్లిసేతర పార్టీలు శక్తి వంచనా అంతర్గత ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. పాతబస్తీలో చార్మినార్ స్థానానికి అధిక ప్రాధాన్యత ఉండటంతో గెలుపోటములు పక్కనబెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని మజ్లిసేతర పార్టీల అభ్యర్థులు అసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహాకూటమి పావులు కదుపుతోంది. నియోజకవర్గంలోని సున్నీ, షీయా ముస్లింలతోపాటు హిందూ సామాజిక వర్గాల ఓట్లు చీలిపోతే తమ విజయం ఖాయమని మహాకూటమి నాయకులు భావిస్తున్నారు. ఒక వర్గం ఓట్లు చీలిపోతే చార్మినార్ నుంచి తమ విజయం తథ్యమని మరోవైపు బీజేపీ నాయకులు సైతం దీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరితో పొత్తు లేకపోవడంతో మజ్లిస్ను తామే దీటుగా ఎదుర్కొంటామనే దీమాలో ఉన్నారు బీజేపీ నాయకులు. ఇక టీఆర్ఎస్ కూడా తమ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించకపోవడం, మజ్లిస్ ఫ్రెండ్లీ పార్టీ కావడంతో వారికి సహకరించే అభ్యర్థి కోసం పార్టీ ఆధిష్టానం వెతుకుతున్నట్టు సమాచారం.
2014లో కంటే దీటుగా..
2014 ఎన్నికల్లో ఎంఐఎంకు ఆయా పార్టీల నాయకులు గట్టి పోటీనిచ్చారు. ఈ ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), టీజేఎస్ల పొత్తు కుదిరినా చార్మినార్ను తమకే కేటాయించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న ట్టు సమాచారం. దీనిపై నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కోరినట్టు విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో మజ్లిస్కు గట్టి పోటీనిచ్చి కేవలం 10వేలతో ఓటమి పాలయ్యాయ మని ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరింత రెట్టింపు ఉత్సహంతో ప్రచారం చేసి విజయానికి కృషి చేస్తామని దీమాలో ఉన్నట్టు సమాచారం.
గట్టిపోటీ..
మజ్లిస్ను దెబ్బకొట్టి చార్మినార్ను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అంతర్గతంగా పావులు కదుపుతున్నట్టు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మహాకూటమి ఖరారైతే చార్మినార్ స్థానం తమకే కేటాయించాలని టిక్కెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావహులు ఉత్సాహంతో పని చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆరు మున్సిపల్ డివిజన్లలో తమ పార్టీ బలంగా ఉందని, కూటమిలో చార్మినార్ టికెట్ను తమకే కేటాయించాలని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
మేమే దీటుగా..
చార్మినార్ నియోజకవర్గంలో మజ్లిస్ను తామే దీటుగా ఎదుర్కొంటామని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎన్నికల్లో చార్మినార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మజ్లిస్కు గట్టి పోటీనివ్వనున్నట్టు సమాచారం. మహాకూటమి, బీజేపీ నాయకులు ఎవరికి వారే సత్తా చాటుతామంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు.