Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 42,552 అక్రమ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్లను తొలగించామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, ప్రహరీగోడలపై 25,288 బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను తొలగించగా ప్రైవేట్ ఆస్తులపై 17,264 తొలగించినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు నగరంలో నిర్వహించిన సోదాల్లో పోలీసు శాఖ ద్వారా రూ.5,79,06,360లను స్వాధీనం చేసుకున్నామని, ఈ మొత్తాన్ని తగు విచారణకు ఆదాయం పన్ను శాఖకు అప్పగించామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను 775 మందికి అందించగా, 3,357 లైసెన్స్డ్ ఆయుధాలను డిపాజిట్ చేశారని పేర్కొన్నారు. 462 మందిని బైండ్ ఓవర్ చేశామని పేర్కొన్నారు. నగరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడానికి ఇప్పటికే నియోజకవర్గాల వారిగా నిఘా బందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని దానకిషోర్ వివరించారు.