Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సికింద్రాబాద్
బిడ్డకు జన్మనిచ్చి ఓ మహిళ ఆస్పత్రిలోనే వదిలేసింది. శుక్రవారం చిలుకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 7న మధ్యాహ్నం ఓ మహిళ గోమతి గాంధీ ఆస్పత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఎవ్వరికీ చెప్పకుండా గురువారం మధ్యాహ్నం శిశువును ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళల గచ్చిబౌలి నివాసితురాలుగా కేసీట్లో వివరాలు పేర్కొంది.