Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
టిప్పర్ ఢ కొని చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్మెట్ మండలం బాచారం గ్రామానికి చెందిన పారంద రవి(28) కొత్తపేటలోని మారుతి నగర్లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి బండ్ల గూడ మీదుగా ఈ నెల 15 రాత్రి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బండ్లగూడ వై జంక్షన్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఏపీ 23వై9990గల టిప్పర్ వచ్చి ఢ కొనడంతో వెంటనే క్రింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో శువ్రారం చికిత్స పొందుతు పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.