Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకునేందుకు యత్నించిన యువకుడి హత్య
నవతెలంగాణ- రాజేంద్రనగర్
మామూళ్లు ఇవ్వలేదని తల్వార్లు, కత్తులతో రౌడీ మూకలు ఓ వ్యక్తిపై దాడి చేయగా అడ్డుకునేందుకు యత్నించిన మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం పాతబస్తీలోని హుస్సేనీ హాలం పోలీస్ స్టేషన్ రికార్డుల్లో రౌడీ షీటర్గా పేరు నమోదైన షాను అనే వ్యక్తి శాస్త్రీపురంలో రౌడీ మామూళ్లు వసూళ్లు చేసేందుకు ఆరుగురు అనుచరులతో వెళ్లాడు. ఈ సందర్భంగా శాస్త్రీపురం గుట్టలో పేకాట ఆడుతున్న వారి దగ్గరికి వెళ్లి మామూళ్లు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో ఓ వ్యక్తి నిరాకరించడంతో ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేయడానికి యత్నించగా అక్కడే ఉన్న ముస్తాక్ అనే యువకుడు అడ్డుకోబోయాడు. దీంతో ముస్తాక్ గుండెల్లో కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న మరో ముగ్గురిపై దాడి చేసి వెళ్లిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడ్డ గ్యాంగ్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రధాన నింధితుడు షాను కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.