Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆటోలో తరలిస్తున్న రూ.8.28 వేలు పట్టివేత
నవతెలంగాణ-ధూల్పేట
పోలీసుల తనిఖీల్లో రూ.8.28 వేలు పట్టుబడిన సంఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని బేగంబజార్ వద్ద జరిగింది. బేగంబజార్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య వివరాల ప్రకారం..ఎన్నికల నేపథ్యంలో పోలీసులు బేగంబజార్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అబిడ్స్ చిరాగ్గల్లీకి చెందిన జస్పాల్సింగ్ భరత్సింగ్ ఆటోలో బేగంబజార్లోని సీల్ఖానాకు వస్తున్నాడు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులు ఆటోను ఆపి తనిఖీ చేయగా ఆయన వద్ద రూ.8 లక్షలా 28వేలు లభ్యమయ్యాయి. డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఇన్కంట్యాక్స్ అధికారులకు అప్పగించినట్టు ఇన్స్పెక్టర్ తెలిపారు.