Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని పహాడిషరీఫ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబార్-శ్రీశైలం ప్రధాన రహదారిపై పెట్రోలింగ్కు వెళ్తున్న కాన్సిస్టేబుల్ రమేష్ తుక్కుగూడ సమీపంలోని హర్డవేర్ పార్కు సమీపంలోని బస్సుస్టాండ్లో గుర్తుతెలియని శవాన్ని గురించాడు. మృతి చెందిన వ్యక్తి యాచకుడిగా గుర్తించారు. మృతుడు పసుపచ్చ రంగు బనియన్, లైట్బ్లూకలర్ షట్, సిల్వర్ కలర్ ప్యాంట్, 5.6 అడుగుల ఎత్తు ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.