Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురికి జైలు శిక్ష
నవతెలంగాణ-హయత్నగర్
డ్రకన్ డ్రైవ్తోనే అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు రాత్రిబవల్లు తేడా లేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 14న ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు ఖర్మాన్ ఘాట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ వారికి శుక్రవారం మెట్రోపాలిటన్ జడ్జి విజయలక్ష్మి నిందితులు శివకుమార్కు 6రోజులు, రాజేశ్వర్రెడ్డికి 2రోజులు, రవీందర్ రెడ్డికి 2రోజులు జైలు శిక్షను విధించినట్టు ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు.