Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారుల తల్లితండ్రుల అసోసియేషన్ ఆరోపణ
నవతెలంగాణ-ఉప్పల్
హైదరాబాద్ ఉమెన్స్ క్రికెట్ సెలక్షన్స్లో భారీ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని క్రీడా కారుల తల్లితండ్రుల అసోసియేషన్ సభ్యులు క్రిష్ణారావు, వినరు, ఉదరుకుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉప్పల్ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. సీనియర్ ఉమెన్స్ క్రికెట్ సెలక్షన్స్లో చీఫ్ సెలక్టర్ మంజుల కిశోర్, మలతీలు ఫిట్నెస్ లేని వారిని ఎంపిక చేస్తున్నట్టు వాపోయారు. ఇదేంటి ప్రశ్నిస్తే తమకు తెలిసనవారని, తమ బంధువులని అందుకే ఎంపిక చేసినట్టు పలువురు బదులిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.