Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
టీఆర్ఎస్ జవహర్ నగర్ పార్టీ కార్యాక్రమంలో టీఆర్ఎస్ ఎన్నికల కమిటీని శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. ఈ కమిటీలో పార్టీ అధ్యక్షుడు రెడ్డిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్చారి, సర్పంచ్ గడ్డమీడి మల్లేష్, జిల్లా నాయకుడు ఏ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు టీ శ్రీరాములు, జే శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ సతీష్, సిద్దులు, మాజీ పార్టీ అధ్యక్షుడు గండి రామచందర్, మహిళా నాయకురాలు పుష్ప, నాయకులు భాస్కర్, జలందర్, మహేష్, బాలరాజు, సత్యనారాయణ ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ శామీర్పేట మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, చందర్రావు, భాస్కర్రావు, శ్రీహరి పాల్గొన్నారు.