Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్మెట్
అల్వాల్లోని లయోలా కళాశాలలో బిజినెస్ అనలిటిక్స్ పరిశోధనా అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సదస్సును ఎంసీఏ, ఏంబీఏ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఈ సందర్భంగా ఎంసీఏ కోర్సు ఆరంభించి 25 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం రాజతోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ బీహెచ్ఈఎల్ రామకృష్ణ, సీఈవో సెమిట్రిక్ ఐటీ సర్వీస్ మాధవి ఉప్పలపాటి, కేజ్ఏ స్వరూప్, మాజీ హెచ్ ఐటీసీ లయోలా కళాశాల రెక్టర్ ఫాదర్ ఎస్ రాజు, ప్రిన్సిపాల్ ఫాదర్ ఆంథోని, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ ఎల్ జోజిరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.