Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంట్రోలర్ కార్యాలయం ఎదుట ఆందోళన
- వీసీని అడ్డుకున్న విద్యార్థులు
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
బీఈడీ పరీక్ష ఫీజుల్ని తగ్గించాలని ఓయూ క్యాంపస్ బీఈడీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు ఓయూ పరీక్షల విభాగం కార్యాలయం (కంట్రోలర్) ఎదుట ధర్నా నిర్వహించారు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఏ వర్సిటీలో లేనంతగా ఫీజుల్ని వసూలు చేయటం సబబు కాదన్నారు. తక్షణమే పరీక్ష ఫీజుల్ని తగ్గించాలని కంట్రోలర్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న ఓయూ వీసీ రామచద్రాన్ని విద్యార్థులు అడ్డుకుని గోడు వెళ్లబోసుకున్నారు. బీఈడీ కళాశాల ట్యూషన్ ఫీజును ఇతర ప్రభుత్వ కళాశాల కంటే తక్కువ చేయాలని కోరారు. స్పందించిన వీసీ సోమవారం సమావేశం ఏర్పాటు చేసి పరీక్షా ఫీజుల్ని తగ్గించేలా ప్రయత్నిస్తామని, ప్రస్తుతం ఉన్న పరీక్ష ఫీజు తేదీని ఎలాంటి అపరాధ రుసుమూ లేకుండా గడువును పొడగిస్తామన్న వీసీ హామీతో విద్యార్థులు ఆందోళన విరమించారు.