Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ, వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించి అండగా ఉండాలని సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి గూడఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్ధూంనగర్ ప్రాంతానికి చెందిన జగదీష్ప్రసాద్(22) రమ్య(21)ల వివాహం మగ్ధూంనగర్లో నివసించే సీపీఐ నేత ఐలయ్య, మాజీ కౌన్సిలర్ గూడవరమ్మలు జరిపించారు. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి పెద్దల సమక్షంలో శుక్రవారం పెళ్ళి చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యా, ఉపాధి అవకాశాల్లో వీరికి సరైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోశెట్టి వెంకటేశ్గౌడ్, రాజుగౌడ్, యాదగిరి, సాయిరాజు, వరలక్ష్మి, లక్ష్మి, ఎల్లమ్మ, జయ తదితరులు పాల్గొన్నారు.