Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
చిన్ననాటి నుంచే విద్యార్థులు మేధస్సుకు పదును పెడితే, భావితరాల మేధావులు తప్పక అవుతారని మేడ్చల్ జిల్లా విద్యాధికారిణి ఐ.వి జయకుమారి విద్యార్థుల కు సూచించారు. మేడ్చల్ జిల్లాస్థాయి వైజ్ఞానిక, గణిత, పర్యావరణ ప్రదర్శన 46వ జిల్లాస్థాయి కుత్బుల్లాపూర్ సర్కిల్ పట్వారినగర్లోని నవజ్యోతి హైస్కూల్ నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన శుక్రవారం ఆమెతో పాటు జిల్లా వైజ్ఞానిక ప్రదర్శన అధికారి రవీందర్రాజు, మండల విద్యాధికారి ఆంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రపంచదేశాలు గర్వించదగ్గ నిపుణులు మన దేశంలో చాలా మంది ఉన్నారని, అబ్దుల్కలాం, శ్రీనివాసరామానుజన్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. 14 మండలాలకు చెందిన 105 ప్రభుత్వ పాఠశాలల, 850 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పలు రకాల ఆకృతులను తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. అనంతరం పలు ప్రదర్శనలను వారు తిలకించి వాటి వివరాలు తెలుసుకున్నారు. 17న జరిగే ముగింపు వేడుకలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వీ.రెడ్డి హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైజ్ఞానిక అధికారి రవీందర్రాజు, పాఠశాల చైర్మన్ ఎం.ఇందిరా రవీందర్రెడ్డి, ప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్స్ అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.