Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సామాజిక రంగాలలో ప్రతిభ కనబరిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సేయింట్ మార్టిన్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సునీరాగోస్వామి అన్నారు. చింతల్ శ్రీసాయినగర్కాలనీలోని సేయింట్ మార్టిన్ పాఠశాలలో ఖోఖో క్లస్టర్ హైదరాబాద్ సహోదయ స్కూల్ కూకట్పల్లి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పోటీలను ఆమె ప్రారంభించారు. సుమారు పరిసర ప్రాంతాల్లోని 9 పాఠశాలలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల కోటా కింద ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు. ఉత్తమ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళేందుకు నేటి విద్యార్థులు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
నేడు ముగింపు వేడుకలు: శనివారం ఈ పోటీల ముగింపు సభతో పాటు విజేతలైన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రముఖ బైక్రైడర్ జయభారతి, ప్రముఖ అథ్లెట్, పాఠశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, డైరెక్టర్లు సేయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్పాత్ర తదితరులు హాజరవుతారని తెలిపారు.