Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేపీహెచ్బీ
టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆజ్ఞను శిరసా వహిస్తాను అని కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు తెలిపారు. కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి సుహాసినిని ప్రకటించిన తరువాత అనంతరం ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు పిలుపు మేరకే అమరావతి లోని వారి నివాసంలో కలిశానని చెప్పారు. నందమూరి కుటుంబంలోని వారు కూకట్పల్లి టికెట్ అడగడం వలనే టికెట్ ఇచ్చామని చెప్పారని తెలిపారు. తనను ముందుండి గెలుపించుకుని రావాలని చెప్పినట్టు తెలియజేశారు. మిత్రపక్షాల వారిని కూడా కలుపుకుని మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పారు.