Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షీ టీమ్ ఎస్ఐ అమృత
నవతెలంగాణ - జగద్గిరిగుట్ట
మహిళలు తలుచుకుంటే ఏదైనా అవలీలగా సాధిస్తారని బాలానగర్ జోన్ షీ టీమ్ ఎస్ఐ అమృత అన్నారు. చింతల్ పరిధి సూర్యానగర్లోని యూనిక్ హైస్కూల్లో జాగృతి కళా బృందం ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహన సదస్సును శుక్రవారం వివిధ ప్రదర్శనల ద్వారా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమృత మాట్లాడుతూ నేడు ప్రతి రంగంలో పురుషులతో సమానంగా శాస్త్ర, సాంకేతిక, వివిధ రంగాలలో దివి నుంచి భువికి మహిళలు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని చెప్పారు. విద్యార్థుల, మహిళల పట్ల ఆకృత్యాలు ఎక్కడోచోట జరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే సైబరాఆద్ కమిషనరేట్లో మహిళల రక్షణ కోసం 'భరోసా' కేంద్రాన్ని ప్రారంభించి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పలు ప్రదర్శనలు జాగృతి కళాబృందం చేసి అబ్బురపరుస్తూ చైతన్యవంతులను చేశారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి.వివయ్య, ప్రిన్సిపాల్ నాగభూషణం, షీ టీమ్, కళాబృందం సభ్యులు, ధనేష్కుమార్, తిరుమల, రవీందర్, బాలమణి, కలీముద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.