Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కల్చరల్ రిపోర్టర్
పిల్లలే తమ అభిమాన హీరోలు పవన్కల్యాణ్, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్బాబులుగా ఆ పాత్రలకు అనుగుణంగా నటించి పరిణత ప్రతిభను ప్రదర్శించిన అంతా వీ చిత్రం దర్శక నిర్మాతల ప్రయోగాత్మకతకు నిదర్శనమని ప్రముఖులు కొనియాడారు. కళానిలయం సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలోని కళాసుబ్బారావు కళావేదికపై శుక్రవారం శంకరం వేదిక సౌజన్యంతో అయాన్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన అంతావీచిత్రం చిత్ర యూనిట్కు అభినందన సత్కారం నిర్వహించారు. వక్తలు రచయిత్రి కేతవరపు రాజశ్రీ, బాలల రంగస్థల ప్రముఖుడు దీనబాంధవ తదితరులు పాల్గొని మాట్లాడుతూ..చిత్రంలో బాలలు పాత్రోచిత నటనతో ఆకట్టుకున్నారని, వారిలోని ప్రతిభను వెలికి తీసిన దర్శకులు రాంకుమార్ అభినందనీయుడన్నారు.