Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈవో అష్లే గ్లోవర్
నవతెలంగాణ - గచ్చిబౌలి
భారతదేశంలో తమ కంపెనీ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళిక తయారు చేసినట్టు రియల్ పేజ్ సీఈవో అష్లే గ్లోవర్ అన్నారు. ఆ సంస్థ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రహేజా ఐటీ పార్క్ లోని భారత దేశ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2019 లో 15 నుంచి 20 శాతం వరకు పనిచేసే సిబ్బందిలో పెరుగుదల ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ హైదరాబాద్ కేంద్రం ద్వారా 1000 మందికిపైగా నిపుణుల బందంతో ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని, ఆపరేషనల్ మద్దతును, కంటెంట్ సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. 2019 నాటికి ఈ సిబ్బందిని 1200లకు పెంచుకోవాలని తమ ప్రణాళిక వేసుకున్నట్టు చెప్పారు. భారతదేశంలోని కేంద్రం లండన్, యునైటెడ్ స్టేట్స్, ఫిలిప్పైన్స్లోని ఇతర అంతర్జాతీయ కేంద్రాలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. రియల్ పేజ్ ఇండియా అనేది ఒక పవర్ హౌస్ అని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కీలకపాత్ర పోషించేందుకు గానూ వినూత్న సాంకేతికను అందిస్తుందని చెప్పారు. సంస్థ భారత దేశ కేంద్ర మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ శర్మ మాట్లాడుతూ తమ కార్యకలాపాల్లో ఇన్నోవేషన్, సింప్లిసిటీని ప్రాధాన్యతగా తీసుకున్నామన్నారు. ఇందులో ప్రతిభావంతులైన వారికే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రియల్ పేజ్ ఎన్ విపి ఆపరేషన్స్ ప్రతినిధి పాల్ సాగ తదితరులు పాల్గొన్నారు.