Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ సాహితీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 17న సుందరయ్య విజ్ఞాన కేంద్రం టీపీఎస్కేలో సామాజిక తెలంగాణ సాధనలో జనస్వరం కవి సమ్మేళనం జరుగుతుందని తెలంగాణ సాహితీ నగర అధ్యక్ష కార్యదర్శులు జి.నరేష్, డి.సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రముఖ సాహితీవేత్త మోతుకూరి నరహరి, మోదుగుపూలు ఎడిటర్ భూపతి వెంకటేశ్వర్లు, సభ అధ్యక్షులుగా తంగిరాల చక్రవర్తి, కవి సమ్మేళన నిర్వహణ సలీమా సయ్యద్ ముజాహిద్ అలీలు నిర్వహణ బాధ్యతలో ఉంటారని తెలిపారు. కవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.