Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముషీరాబాద్: తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రక్షాళన చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దోమలగూడ వార్డ్ ఆఫీస్లో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అంజయ్య, కె.దేవదాస్, జి.అశోక్కుమార్ యూనియన్లో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడడం, యూనియన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలకు పాల్పడుతుండడం వల్ల వీరి సభ్యతం రద్దు చేసి యూనియన్ నుండి బహిష్కరించారు. కొత్త కార్యవర్గ సభ్యులుగా సి.సతీష్ కుమార్, గౌరవ అధ్యక్షులు, కె.బాలకృష్ణ అధ్యక్షుడు, కె.వెంకటేష్ సెక్రటరీ, అడ్వేసోర్స్ టి.అశోక చక్రవర్తి, పి.విగేశ్వర్, ఎస్ సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ బి. హరిరామ్, ఈ నాగరాజు, పి మల్లేష్. ఎన్ దుర్గయ్య, ట్రెజరర్. వైస్ ప్రెసిడెంట్స్ , కృపాదానం, కె శ్రీనివాస్, అడిషనల్ జనరల్ సెక్రటరీ ఆర్ యాదగిరి, శ్రీధర్లను ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నుకున్న కార్యవర్గం ఉద్యోగ కార్మికుల సమస్యలు, హక్కులపై అహర్నిశలు పాటుపడతామని మాట్లాడారు.