Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉస్మానియా యూనివర్సిటీ: మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్-టీఎస్) ఓయూ అధ్యక్షుడిగా గుమడెల్లి తిరుమలేష్ను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్, కొంగరిశంకర్ మాదిగలు తెలిపారు. తిరుమలేష్ ఓయూ దండోరా ఉద్యమంలో, విద్యార్థిగా క్రియాశీలకంగా పని చేశారు. ఆయన ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ విభాగంలో విద్యను అభ్యసిస్తున్నారు.
ఓయూలో ఎంఎస్ఎఫ్ను బలోపేతం చేస్తామని, ఎంఎస్ఎఫ్ హక్కులు, వర్గీకరణ కోసం, వర్సిటీ సమస్యలపై ఉద్యమిస్తామని తిరుమలేష్ అన్నారు. ఆయన రాష్ట్ర ఎంఎస్ఎఫ్ అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు.