Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్చరల్ రిపోర్టర్: స్మార్ట్ఫోన్లు, గృహోపకర అమ్మకాలలో భారతదేశంలోనే జంటనగరాలు టాప్గా నిలిచాయని వన్అసిస్ట్ కో ఫౌండర్ గగన్మైనీ తెలిపారు. కొన్ని వారాలుగా హైదరాబాద్ కేంద్రంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఫోన్లను అందజేస్తూ ప్రజలకు దగ్గరవుతుందని చెప్పారు. స్మార్ట్ఫోన్ల వినియోగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుత కాలంలో వినియోగదారులకు ప్రమాదం సందర్భంగా ఏర్పడే స్మార్ట్ఫోన్ నష్టం, దొంగతనం నుంచి కాపాడుకునేందుకు రక్షణ అంశాల్లో మొబైల్ ప్రొటెక్షన్ సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు. గృహోపకరణ అమ్మకాలు పండుగ దినాల్లో రెండంకెల మించిన వృద్ధి రేటును సాధించినట్టు తెలియజేశారు.