Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని
- డీఈఓ వెంకట నర్సమ్మకు పీడీఎస్యూ నాయకుల వినతి
నవతెలంగాణ- చాధర్ఘాట్
మలక్పేట్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు రియాజ్, నాగరాజు డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఈస్ట్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ డీఈఓ వెంకట నర్సమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలక్పేటలోని పాఠశాలలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వీరందరూ పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఉన్నా నిరుపయోగంగా మారాయని, పాఠశాల ప్రాంగాణం చెత్త చెదారంతో డంపింగ్ యార్డుల తయారైందని వినతిలో తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో విద్యార్థులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం అందజేసిన వారిలో పీడీఎస్యూ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు నాగరాజు, నవీన్మంద, సహాయ కార్యదర్శి సైదులు, సుధాకర్, నాయకులు శ్రీను, మురళీ, మహేష్ ఉన్నారు.