Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
బీఎన్.రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్నగర్లో గల అతిపురాతనమైన త్రినేత్ర ఆంజేయ ఆలయంలో హుండి లెక్కిం పు శుక్రవారం ఆలయ ఈఓ అన్నపూర్ణ, చైర్మన్ పెండ్యాల శ్రీనివాస్గౌడ్, గ్రామస్థుల సమక్షంలో జరిగింది. ఈ లెక్కింపులో నగదు రూ.2,39,970 రాగా, చింతచెట్ల వేలం పాటలో రూ.25,100 వచ్చినట్టు చైర్మన్ శ్రీని వాస్గౌడ్ తెలిపారు. గడిచిన 8 నెలలుగా హుండి లెక్కింపును మాత్రమే జరిగిందని, ఈ మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపారు.