Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బడంగ్పేట : ప్రభుత్వ ఆదేశం మేరకు చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్లో అందరు భాగస్వా ములు కావాలని బడంగ్పేట మున్సిపాలిటీ కమిషనర్ జి.శ్రీని వాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బడంగ్పటలో శానిటేషన్ సిబ్బం దితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కాలనీలో నుంచి సిబ్బంది సేకరి స్తున్న తడి, పొడి చెత్తను వేరుచేసి తీసుక రావాలని తెలిపారు. తడిచెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నామని తెలిపారు. సేంద్రియ ఎరువుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రసాయనిక ఎరువులను వాడొద్దని రైతులకు సూచించారు. రసాయ నిక ఎరువులను వాడితే అనారోగ్యాలకు గురవుతున్నారని తెలి పారు. సేంద్రియ ఎరువులను వాడితే ఆరో గ్యమైన జీవిన విదా నం ఉంటుందన్నారు. రోడ్లకు ఇరువైపుల ఎవ్వరూ చెత్తవేయొద్దని, చెత్త వేస్తే వారికి జరిమాన విధిస్తామని హెచ్చరించారు. బడం గ్పేటను చెత్తరహిత మున్సిపాలిటీగా తయా రు చేసేందుకు సహకరించాలని కోరారు.