Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-హయత్నగర్
నిరంతరం శ్రామికులు, కార్మికుల సమస్యల కోసం తెలంగాణలో పోరాటం చేసే ఏకైక పార్టీ బీఎల్ఎఫ్ అని బీఎల్పీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే అ భ్యర్థి మామిడి రాంచందర్ అన్నారు. శుక్రవారం హయత్నగర్ డివిజన్ పరి ధిలోని వీరభద్రనగర్, సుబ్రమణ్యనగర్ కాలనీల్లో ఇంటింటికీ తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎక్కువగా కార్మికులు ఉన్నారన్నారు. రాజ్యాంగ ప్రకారం వారు చేసిన పనికి రావాల్సిన ఫలితం, వారి హక్కుల కోసం యాజమాన్యంతో పోరాటం చేసే పార్టీ బీఎల్ఎఫ్ అని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వివిధ కులాల జనాభా ప్రతిపాధికన రిజర్వేషన్ల ప్రకారం సీటు కేటాయించిన ఏకైక పార్టీ బీఎల్ఎఫ్ మాత్రమే అని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ చేయని సాహసాన్ని కేవలం బీఎల్ఎఫ్ మాత్రమే చేసి అన్ని వర్గాల పేదలకు సీట్లు కేటాయించారన్నారు. అందులో నేను ఒక్కడినవ్వడం సంతోషంగా ఉందన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత కల్పించిన అవకాశాన్ని పేదలు అందిపుచ్చుకుని ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్లో ఎక్కువ శాతం బహుజన ఓటర్లను చూసి తాను ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అందరి సహకారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ బీఎల్ఎఫ్ ఇన్చార్జి చంద్రమోహన్, బీఎల్ఫ్ నాయకులు పారంద స్వామి, పుట్ట యాదయ్య, తాడూరి వెంకట్, మున్నా, ఇస్మాయిల్, చెన్నమ్మ, వీరయ్య, వెంకన్న, ఎల్లయ్య పాల్గన్నారు.