Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
సికింద్రాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో శుక్రవారం కంటోన్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ రెండు నామినేషన్లు దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ కార్యాలయంలో పార్వతి లోక్తాంత్రిక్ సర్వ సమాజ్ పార్టీ, సునీల్ ఇండిపెండెంట్ అభ్యర్థి. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రఘుప్రసాద్కు నామినేషన్లు దాఖలు చేశారు.
మల్కాజిగిరి: మల్కాజిగిరి జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఐదో రోజు నలుగురు అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్కు దాఖలు చేశారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నందికంటి శ్రీధర్, బీజేపీ అభ్యర్థి రామ్చందర్గౌడ్, బహుజన రాష్ట్ర సమితి పార్టీ రమేష్, లోగారి, స్వర్ణభారత్ పార్టీ రాహుల్ పండిత్లు నామినేషన్లు దాఖలు వేశారు.
ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం కొనసాగుతునే ఉంది. శుక్రవారం శివసేన పార్టీ నుండి జగదీష్ చౌదరి, న్యూ ఇండియ పార్టి నుండి బాలరాజు, స్వతంత్ర అభ్యర్థులుగా విజరుకుమార్, రాజులు నామినేషన్లు వేసినట్లు ఉప్పల్ రిటర్నింగ్ అధికారి కృష్ణశేఖర్ తెలిపారు. ఉదయం 11 గంటల నుండి, మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు.
మేడ్చల్ కలెక్టరేట్: మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొంపల్లి మోహన్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మల్కాజిగిరి: నేడు మల్కాజిగరి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నందికంటి శ్రీధర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.