Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉన్నాయని ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎల్.వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను పరిశీలించడానికి హైదరాబాద్లో పర్యటిస్తున్న ఉత్తర్ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఎల్.వెంకటేశ్వర్లు, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రత్నేష్సింగ్లు శుక్రవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల అధికారి దానకిషోర్, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇతర నోడల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో ఓటర్ల జాబితా సవరణ, నమోదు, ఎన్నికల ఏర్పాట్లు, స్వీప్ కార్యక్రమాలు, ఓటరు చైతన్య కార్యక్రమాలు, బందోబస్తు తదితర ఏర్పాట్లపై దానకిషోర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. దాదాపు 40 లక్షల మంది ఓటర్లు 15 నియోజకవర్గాలు కలిగి ఉన్న హైదరాబాద్ నగరంలో ఎన్నికల ఏర్పాట్లు బాగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా ఫ్యూరిఫికేషన్, యువ ఓటర్ల నమోదులో చేపట్టిన కృషిని అభినందించారు. అనంతరం సి-విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదుల కంట్రోల్ రూమ్ను, వివిప్యాట్, ఈవీఎంలపై ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ను సందర్శించారు.