Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఎల్బీనగర్
ఎల్బీనగర్ నియోజకవర్గం ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్, టీడీపీ మధ్య ప్రతిష్టంబన నెలకొన్నది. కాంగ్రెస్కు సీటు ఖరారైందని అంతా భావిస్తున్న సమయంలో మొదటి, రెండవ విడుత జాబితాలో ఎల్బీనగర్లో పేరు ఏ పార్టీకి ఖరారు కాకపోవడంతో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పోటీ చేయాలని కార్యకర్తలందరూ భావిస్తున్నారు. టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఢిల్లీలో మకాం వేశాడు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఇచ్చారు. కానీ తను మాత్రం ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తానని, అక్కడే టికెట్ కావాలని ఆందోళన చేస్తున్నాడు. దీతో ఎల్బీనగర్ సీటుపై పటిష్టంబన నెలకొన్నది.
టీఆర్ఎస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నా ఎల్బీనగర్లో సీటు ఖరారు కాకపోవడం టీడీపీ, కాంగ్రెస్కు లాభం కంటే నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ నువ్వా, నేనా అనే విధంగా ఎన్నికల ప్రచారాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పొత్తులో సీటు ఎవరికీ వచ్చిందనే దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో గతంలో నిర్వహించిన కాంగ్రెస్ సభకు రాహుల్గాంధీ రావడంతో ఎల్బీనగర్ కాంగ్రెస్ పోటీ చేస్తుందని భావించారు. అలాగే ఎల్బీనగర్ నుంచి టికెట్ ఆశిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డికి ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ ఇచ్చారు. దాంతో ఎల్బీనగర్లో కాంగ్రెస్కే టికెట్ వస్తుందన్నటే.. కానీ సామ రంగారెడ్డి తనకు ఎల్బీనగర్ నుంచే టికెట్ కావాలని పట్టుబట్టారు. ఆయన కార్యకర్తలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఎల్బీనగర్ సీటు విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు పార్టీల మధ్య సమన్వయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇంకా పొత్తులు ఖరారు కాకపోవడంతో ఎల్బీనగర్లో టీఆర్ఎస్ ఖుషీగా ఉంది. టీఆర్ఎస్ తమకు ప్రత్యర్థే లేడని ప్రచారం చేస్తోంది. ఎల్బీనగర్లో కాంగ్రెస్, టీడీపీ కలిస్తే బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికైనా కాంగ్రెస్, టీడీపీలు ఎల్బీనగర్లో ప్రతిష్టంభనకు పోకుండా సత్వరమే సీటు సంగతి తేల్చాలని కాంగ్రెస్, టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు.