Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేపీహెచ్బీ
కూకట్పల్లి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పన్నాల హరీశ్చంద్రారెడ్డి శుక్రవారం రాజ్యసభ సభ్యులు, బీఎస్పీ తెలంగాణ ఇన్చార్జి వీర్ సింగ్, బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి దయానంద్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేసేందుకే బీఎస్పీలో చేరుతున్నట్టు తెలిపారు. ఏనుగు గుర్తుకు ఓటువేసి మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం సంగీత్ నగర్ దాయార్ గూడా చందు ఆధ్వర్యంలో దాయారుగూడా యూత్ యువకులు హరిచంద్రారెడ్డికి మద్దతు తెలుపుతూ బీఎస్పీలో చేరారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజశేఖర్, శ్రీవాస్, సుభాష్, విష్ణు వర్ధన్, వినోద్ పాల్గొన్నారు.