Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాల్గొన్న బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్
నవతెలంగాణ-బంజారాహిల్స్
హీరో మోటర్ బైక్ నుంచి నూతనంగా డిస్టినీ 3ఎస్ 125 సీసీ స్కూటర్ను బ్యాడ్మింటన్ కోచఖ్ పుల్లెల గోపీచందర్ శుక్రవారం ప్రారంభించారు. బంజరాహిల్స్ రోడ్నెం.1లోని తాజ్కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని స్కూటర్ను లాంచ్ చేశారు. ఆయనతోపాటు హీరో మోటర్ సంస్థల రీజినల్ ఆఫీసర్ సాయి హరి, గోపీచంద్ తండ్రి సుభాష్ చంద్రబోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ హీరో మోటర్ సైకిల్ సంస్థ భారతదేశపు సంస్థ స్వదేశీ వస్తువని, వాడటం మన బాధ్యతని తెలిపారు. డిస్టినీ స్కూటర్ అత్యాధునిక హంగులతో ముఖ్యంగా మహిళలకు అన్ని విధాలుగా సరిపోయే విధంగా రూపుదిద్దుకొని మార్కెట్లోకి రాబోతోందని తెలిపారు. ఈ సందర్భంగా సాయిహరి పుల్లెల గోపీచంద్ జన్మదినాన్ని పురష్కరించుకుని అక్కడే కేక్ కట్ చేయించారు. గోపీచంద్కు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర మోటర్స్లో లాంచింగ్
నారాయణగూడ: ద్విచక్ర వాహనం పై ప్రయాణించే వారి భద్రత, హుందాతనాన్ని దృష్టిలో ఉంచుకుని డెస్టినీ ద్విచక్ర వాహనాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్టు శ్రీవెంకటేశ్వర మోటార్స్ జనరల్ మేనేజర్ రమణమూర్తి తెలిపారు. నారాయణగూడలోని శ్రీ వెంకటేశ్వర మోటార్స్ షోరూమ్లో హీరో సంస్థ 'డెస్టినీ (125 సీసీ ఇంజన్)' గల టూ వీలర్ వాహనాన్ని శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ వాహనాన్ని షోరూంలో వినియోగదారులకు గురువారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ 'ఐత్రీఎస్' టెక్నాలజీతక్ష ఇంజన్ని రూపొందించినట్టు చెప్పారు. ట్యూబ్లెస్ టైర్స్, ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు, బయట నుంచే ఇంధనం నింపే సౌకర్యం, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, డీజీ ఎనలాగ్ స్సీడో మీటర్ ఇన్ని సౌకర్యాలతో వాహనాన్ని రూపొందించినట్టు వివరించారు. నాలుగు కలర్స్లో వాహనం లభిస్తున్నట్టు ఆయన తెలిపారు.