Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
గుంతలు పడ్డ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంవీ.రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన జిల్లా ఆర్అండ్బీ, ఇఇపీఆర్, డీపీఓ, ఎంపీడీఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్లు గుంతలయమం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రోడ్లపై సైన్బోర్డులు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని, డివైడర్లు, చెట్ల కొమ్మలు బాగా పెరిగి ప్రయాణానికి ఇబ్బందికంగా మారాయని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ రోడ్లుకు మరమ్మతులు చేయాలని డీపీఓను ఆదేశించారు. రోడ్ల ప్రక్కన ఉన్న చెట్లకి మార్కింగ్ చేస్తే అందంగా కన్పిస్తాయని చెప్పారు. పంచాయతీ రాజ్ చేపట్టిన పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేదని, కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి పూర్తి చేయించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ అధికారి చందర్సింగ్, ఈఈ పంచాయతీరాజ్ అధికారి రామ్మోహన్ రావు, డీపీఓ రవికుమార్, ఎంపీడీఓలు, ఏఈలు, డీఈలు పాల్గొన్నారు.