Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్
- ఓట్లు బీసీలవి సీట్లు అగ్రకులాలకా
- బీసీ రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి అనంతయ్య
- అంబర్పేట, దిల్సుఖ్నగర్లో ధర్నాలు
నవతెలంగాణ- అంబర్పేట్
బీసీలకు రాజకీయంగా న్యాయం చేస్తామని చెప్పిన ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో మోసం చేశాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. అన్ని పార్టీలు బీసీలకు తక్కువ సీట్లు కేటాయించడాన్ని నిరసిస్తూ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంబర్పేట్లోని అలీకేఫ్ చౌరస్తాలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో అన్ని పార్టీలు బీసీలకు న్యాయం చేస్తామని, జనాభా ప్రాతిపాదికన సీట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేశాయని ఆరోపిం చారు. మహాకూటమి దొంగల, దోపిడీ, రెడ్డి కూట మిగా మారిందని విమర్శించారు. ధర్నాలో నాయ కులు విక్రమ్, కుల్కచెర్ల శ్రీనివాస్, ఎంబీసీ విద్యార్థి సంఘం అద్యక్షుడు పి.బడేసాబ్, బీజేపీ నాయకులు అనంద్గౌడ్ పాల్గొన్నారు.
ఓట్లు బీసీలవి.. సీట్లు అగ్రకులాలకా..
చాధర్ఘాట్ : అత్యధిక జనాభా బీసీలు ఉంటే సీట్లు మాత్రం అగ్రకులాలకు కేటాయిస్తారా అని బీసీ యువ జన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతయ్య అన్నారు. కాంగ్రెస్ బీసీలకు కేవలం 15 సీట్లే కేటాయించడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం దిల్సుఖ్నగర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అనంతయ్య మాట్లాడు తూ బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిసనగా ఈ నెల 17వ తేదీన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర బంద్ చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ బంద్కు అన్ని ప్రజాసంఘాలు, రాజ కీయ పార్టీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు మద్దతు తెలపా లని కోరారు. బీసీలకు 24 సీట్లు మాత్రమే కేటాయి ంచి టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. ఆయా పార్టీలు ఉద్దేశపూర్వకంగానే బీసీలను అణిచివేసు ్తన్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నీల వెంకటేష్, సి.రాజేందర్, టి.రాజ్కుమార్, ఒర్క కృష్ణ, రాజేష్ గౌడ్, చందు, చిన్న, యాదయ్య, రాంబాబు, ఎం.మ హేందర్గౌడ్, ఈశ్వర్గౌడ్, ప్రమోద్ పాల్గొన్నారు.