Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్గౌడ్
నవతెలంగాణ-వనస్థలిపురం
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్ల పరిధిలోని పేదల బస్తీలు, శివారు కాలనీల అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దగౌని రామ్మోహన్గౌడ్ అన్నారు. శుక్రవారం బీఎన్.రెడ్డినగర్ డివిజన్ పరిధిలోని భవాని ఎన్క్లేవ్లో స్థానిక కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన ఇంటింటికీ టీఆర్ఎస్ సంక్షేమం పేరుతో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి స్వరాష్ట్రాన్ని సాధించారో వారి కళలను ముఖ్యమంత్రి కేసీఆర్ నూటికి నూరు శాతం నెరవేర్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు పేదలకు అంది గ్రామాల్లో నగరాల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలు కడుపునిండా అన్నం తింటున్నారంటే కేసీఆర్ పథకాలే కారణమన్నారు. అనంతరం సాహెబ్నగర్కు చెందిన బుద్దోలు అర్జున్గౌడ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు రామ్మోహన్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సువర్ణ, రమేష్రెడ్డి, వెంకటయ్య, శంకర్నాయక్, ప్రశాంత్, చౌదరి, మల్లారెడ్డి, నేతాజీ, గోపాల్, ఎల్లయ్య, పద్మ, సరస్వతి, విజయ, చంద్రకాంత్గౌడ్ తదితరులున్నారు.