Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని కార్పొరేటర్ పారుపల్లి అనితా దయాకర్రెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లోని లక్ష్మీనగర్, ఎస్బీఐకాలనీ, విజయపురికాలనీల్లో కాలనీ సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ సరూర్నగర్ డివిజన్ అభివృద్ధి చెందాలంటే మరోసారి తీగల కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిం చాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. సరూర్నగర్ డివిజన్ రూ.46కోట్లతో యూజీడీ పైపులైన్లు, సీసీరోడ్లు, కమ్యూనిటీహాల్, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించినట్టు తెలిపారు. డిసెంబ ర్ 7న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పారుపల్లి దయాకర్రెడ్డి, కో ఆర్డినేటర్ బేర బాలకిషన్, నాయకులు అంకిరెడ్డి, సూరోత్తం ముదిరాజ్, ఇస్మాయిల్, సలీం, జహీర్, సుదర్శన్, జంగారెడ్డి, కేశవరెడ్డి, శేఖర్రెడ్డి, పీ.రాజు, రాజు, అభిలాష్గౌడ్, కట్టా ప్రవీణ్, నరసింహగౌడ్, ఉషారెడ్డి, రాములు యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.