Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
- కొత్తపేట డివిజన్లో పర్యటన
నవతెలంగాణ-ఎల్బీనగర్
తెలంగాణలో మహాకూటమి అభ్యర్థులదే విజ యమని ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ ర్రెడ్డి అన్నారు. శుక్రవారం కొత్తపేట డివిజన్లో పర్య టించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం వనస్థ లిపురం డివిజన్ పరిధిలోని చింతలకుంట వద్ద ఉన్న ఫెయిత్ చర్చినీ సందర్శించి మొదటి వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేండ్ల టీఆర్ఎస్ పాలనలో కొత్తపేట డివిజన్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. భూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోస గించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధికి, టీఆర్ఎస్ అవినీతికి జరుగుతున్న ఎన్నికలన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థు లే ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎల్బీనగర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు దయానంద్, విల్సన్, ప్రసాద్, అరుణ్, డెనియల్, యేసు, అబ్బుల్ తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం : ఎల్బీనగర్ నియోజ కవర్గంలోని ఆడపడుచుల జీవితాల్లో వెలుగులు నింపాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్రెడ్డి గెలుపుతోనే సాధ్య మవుతుందని కమలాసుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మల్కా జిగిరి పార్లమెంటరీ జనరల్ సెక్రెటరీ జహంగీర్ ఆధ్వర్యంలో హస్తినాపురం డివిజన్లో ఏర్పాటు చేసిన మహిళల సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ లాసుధీర్రెడ్డి మాట్లాడుతూ మహిళల ందరూ సంఘటితమై కాంగ్రెస్కే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్ర మంలో శ్రీనివాస్యాదవ్, పర్విన్, ఇందిర, సంధ్య, శారద, అజ్జుబేగమ్, షాహిదాబీ, ఫర్జానాబేగం, సలీం తదితరులు పాల్గొన్నారు.