Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5 వేల మందితో ఎన్నికల ప్రక్రియ వెబ్కాస్టింగ్
- జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో అతి తక్కువగా ఉన్న యువ ఓటర్ల నమోదు కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో అతి తక్కువ సమయంలో యువ ఓటర్ల సంఖ్య 0.59 శాతం నుండి 1.44 శాతానికి పెరిగిందని జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిషోర్ అన్నారు.
జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చిన ఉత్తర్ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి, జాయింట్ సీఇఓలు శుక్రవారం హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా జరుగుతున్న ఎన్నికల ఏర్పాట్ల గురించి దానకిషోర్ వారికి వివరించారు. ఓటర్లలో 18-19 ఏండ్ల వయస్సు గల ఓటర్లు 3.74 శాతం ఉండాల్సి ఉండగా ఇంకా 2.30 శాతం తక్కువగా ఉన్నారన్నారు. మూడు నెలలుగా నగరంలోని వివిధ కళాశాలలు, విద్యా సంస్థల్లో తాముచేసిన ఓటరు నమోదు చైతన్య కార్యక్రమంలో భాగంగా 0.59 శాతం ఉన్న యువ ఓటర్ల సంఖ్య 1.44 శాతానికి పెరిగిందని వివరించారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎన్నికల జాబితా ప్యూరిఫికేషన్ సవాల్తో కూడుకున్నదని, అయినా రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో పాటు బీఎల్ఓలతో పెద్ద ఎత్తున ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఓటర్ల జాబితాలో అక్షర దోషాలు, ఇంటి నెంబర్లు తప్పుగా పేర్కొ నడం, ఫొటోల మార్పిడీ, ఒకే ఇంటి నెంబర్పై అనేక మంది ఓటర్లు ఉండడం లాంటి సమస్యలుండగా వీటిని ఇఆర్ఓ, ఏఇఆర్ఓ, బీఎల్ఓలు సరిచేశారన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో ఒకే ఇంట్లో లేదా ఒక కంపౌండ్లో ఉమ్మడి కుటుంబాలు ఉండడం, ఒకే ఇంటి నెంబర్పై 40 నుండి 50 మంది ఓటర్లున్న సంఘటనలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ సారీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా కొత్తగా ప్రవేశపెట్టిన వీవీ ప్యాట్లపై విస్తత స్థాయిలో అవగాహన కల్పించామని పేర్కొ న్నారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల చెకింగ్, తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తిచేయడంతో పాటు ఈవీఎంలను సంబంధిత నియోజకవర్గాల డీఆర్సీ కేంద్రాలకు కూడా పంపించనున్నట్టు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో 1290 పోలింగ్ కేంద్రాలను క్రిటికల్ కేంద్రాలు గా గుర్తించి విస్తత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరం లో శాంతి భద్రతల పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులో ఉందన్నారు. ఈ సమావేశంలో నగర పోలీస్ అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహాన్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు హరిచందన, కెనడి, విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి పాల్గొన్నారు.
5 వేల మందితో ఎన్నికల ప్రక్రియ వెబ్కాస్టింగ్
శాసనసభ ఎన్నికల సందర్భంగా డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్కు 5000 మందితో వెబ్కాస్టింగ్ చేయనున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వెబ్కాస్టింగ్లో పాల్గొనడానికి ఆసక్తి కనబరిచే అభ్యర్థులు ముఖ్యంగా సీనియర్ ఇంజినీరింగ్ విద్యార్థులు జీహెచ్ఎంసీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఇంజినీరింగ్ కళాశాలలను సంప్రదిస్తున్నారని చెప్పారు. సొంత ల్యాప్టాప్ కలిగిన అభ్యర్థులు ష్ట్ర్్జూర://bఱ్.శ్రీy/షవbషa్-2018 వెబ్సైట్ ద్వారా గాని మైజీహెచ్ఎంసీ యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల వెబ్కాస్టింగ్ విధుల్లో పాల్గొనే వారికి తగిన పారితోషికం ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్ కూడా ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 6309920631, 6309981289 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.