Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూటమిలో పొసగని పార్టీలు
- టీడీపీ, కాంగ్రెస్ మధ్య స్థానిక లొల్లి
- ఇరుపార్టీల నేతలకు ఇంటిపోరు
- సనత్నగర్, సికింద్రాబాద్ స్థానాలకు నేడు అభ్యర్థుల ప్రకటన
ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. కానీ స్థానాల ఎంపిక, టికెట్ల కేటాయింపు విషయంలో మొదటి నుంచీ ఎవరికి వారు యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. ఇప్పుడు కూడా కూటమిలోని పార్టీలకు ఒకరంటే మరొకరికి పడటంలేదు. టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తామని టీడీపీ కార్యకర్తలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. మరో పక్క అంబర్పేట్ స్థానాన్ని టీజేఎస్కు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా కూటమిలోని పార్టీల్లో సమన్వయం కొరవడిందని, వాళ్లల్లోనే సమన్వయంలేని పార్టీలు టీఆర్ఎస్ను ఎలా ఓడిస్తారని పలువురు విమర్శిస్తున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీలకు సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సనత్నగర్, సికింద్రాబాద్ నియోజక వర్గాల్లో ఇప్పటి వరకూ కూటమి అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్కు కేటాయిస్తారా? టీడీపీకి కేటాయిస్తారనేది నేడు తేలనుంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
కాంగ్రెస్లో
టికెట్ల లొల్లి ముగియలేదు. ముఖ్యంగా సనత్నగర్ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. మర్రి శశిధర్రెడ్డికు ఇస్తారా? లేదా? అనే జోరుగా సాగుతోంది. సికింద్రాబాద్ సీటు తనకే కేటాయించాలని మాజీ మేయర్ బండకార్తీకరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై గురువారం ఢిల్లీలో రాహుల్గాంధీ ఇంటి వద్ద ధర్నా చేసిన విషయం విధితమే. అంబర్పేట్ సీటును తన వర్గీయులకే కేటా యించాలని సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు డిమాండ్ చేస్తు న్నారు. వీటితో పాటు ఉప్పల్ నియోజకవర్గ ంలో టీడీపీకి సహకరించేది లేదని స్థానిక కాం గ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
టీడీపీలో...
గత ఎన్నికల్లో గ్రేటర్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీ ఈ సారీ కుమ్ములాటలతో కొట్టుమిట్టాడుతోంది. అంబర్పేట్లో టీడీపీ తరుపున వనం రమేష్ నామినేషన్ వేశారు. శనివారం బిల్డర్ ప్రవీణ్ సైతం నామినేషన్ వేయనున్నారు. శేరిలింగం పల్లిలో భవ్య ఆనంద్ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొవ్వ సత్యనారాయణ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. భవ్యకు సహకరించేదిలేదని తేల్చిచెబుతున్నారు. కూకట్పల్లిలో మొన్నటి దా కా పెద్దిరెడ్డి పోటీ చేస్తారని జోరుగా ప్రచా రం జరిగింది. అనూహ్యంగా నందమూరి సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. బాబు కూడా ఆమె అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామని కూకట్పల్లి కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మల్కాజ్గిరిలో టీజేఎస్ అభ్యర్థికి సహకరించేదిలేదని కాంగ్రెస్ కార్యకర్తలు తెగేసి చెబుతున్నారు.