Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నేరేడ్వెట్
ఇంట్లో నుంచి బయటికెళ్లిన విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడ్మెట్ సీఐ నర్సింహాస్వామి తెలిపిన వివరాల ప్రకారం చంద్రగిరి కాలనీలోని సెవన్ హిల్స్ అపార్టుమెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్న నంగనూరి ఉపేందర్ ఇతను కుమారుడు కల్యాణ్ (14) నేరేడ్మెట్ మూడు గుళ్ల దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 12న పాఠశాలకెళ్లి ఇంటికొచ్చి బయటికి వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదని, దీంతో స్నేహితులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో ఎంత వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.