Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధూల్పేట్
పాతబస్తీ మీరాలం జలామండలి ప్రాంతంలో ట్యాంకర్ డ్రైవర్ కళ్లలో కారంపోడి చల్లి హత్య కేసు ఘటనలో ఆరు నిందితులను కాలా పత్తార్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చార్మినార్ ఏసీపీ అంజయ్య ఇన్స్పెక్టర్తో కలిసి చార్మినార్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. హస్సన్ నగర్ ప్రాంతానికి చెందిన షరీఫ్ వాటర్ ట్యాంక్ డ్రైవర్. అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ మతావుల్లా సోదరుడు ముహీజ్ హతావుల్లా మిత్రులు. 2011 జూలైలో మీరాలం చెరువులో బోటింగ్ చేస్తుండగా ముహీజ్ హతావుల్లా మరణించాడు. తన సోదరుడు మరణానికి షరీఫ్ కారణమని అనుమానించాడు. షరీఫ్ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో బాగంగా ఈ నెల 12వ తేదిన షరీఫ్ వాటర్ ట్యాంక్తో వస్తుండగా చనిపోయిన ముహీజ్ హతావుల్లా సోదరులు మహ్మద్ హతావుల్లా, సోహెల్ హతాముల్లాలు వారి మిత్రులు సయ్యద్ ఫర్వేజ్ పాషా, మహ్మద్ ఫకృద్దీన్ ఖాన్, మీర్జా సైయీవ్ తైమారీ, షేక్ యాపిన్లు అడ్గగించి అతనిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్యచేశారు. బాధితుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.