Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
ఘరానా నేరస్థుడిపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. సీపీ అంజనీకుమార్ ఆదేశాలతో శుక్రవారం కాచిగూడలో నివాసముంటున్న మాహ్మద్ ఆజామ్(31) అలియాజ్ చాచా, బాషాఖాన్పై పీడీ యాక్టు నమోదు చేశారు. వెస్టు బెంగాల్కు చెందిన ఆజామ్ కొన్నేండ్ల క్రితం ఉపాధి కోసం నగరానికికొచ్చాడు. కొద్ది రోజులు లేబర్గా పనిచేసిన ఆజామ్ అందులో ఆశించినంత మేరకు డబ్బుల సంపాదన లేకపోవడంతో నేరాలపై దృష్టి సారించాడు. అమాయకులను ఎంచుకుని వారి దృష్టి మళ్లించి దోపిడీలు చేయడం ప్రారంభించాడు. నగర కమిషనరేట్ పరిధిల్లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి. అయినా ఆజామ్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు.