Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
'పల్లవించనా నా గొంతులో' పాట అమిన్పాషా గళంలో సుమధురంగా పల్లవించి శ్రోతల ను మధురానుభూతులకు లోను జేసింది. శ్రీత్యాగరాయ గానస భలో సుస్వర వాహిని సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం సినీగీత విభావరి నిర్వహించారు. అమిన్పాషాతో పాటు కీర్తి మెహరా, శారద, సురేఖ తదితరులు యుగళ గీతాలను పాడి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత వంశీరామరాజు తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడు యూసుఫ్, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం నాయకుడు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర పోలీసు అసోసియేషన్ ప్రధాన సలహాదారు జిఎస్ రాజు పాల్గొని అమిన్పాషాను సత్కరించారు. గాయకుడు త్రినాథరావు తన అభినందనలను తెలిపారు.