Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
భావ కవిత్వ ఉద్యమశీలి దేవులపల్లి కృష్ణశాస్త్రితోపాటు అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావులనూ పేర్కొంటారని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నాళేశ్వర శంకరం తెలిపారు. శ్రీత్యాగరాయ గానసభలోని లలిత కళావేదికపై సుమధుర ఆర్ట్స్ ఆధ్వర్యంలో బసవరాజు అప్పారావు జయంతి సమావేశం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ శంకరం పాల్గొని మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మహామహులందరూ కవిత్వంలో తమ రచనల ద్వారా భావ కవితోద్యమానికి పునాదులు వేశారని వివరించారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్థనమూర్తి అధ్యక్షత వహించిన సభలో సహాయ కార్యదర్శి టి చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపిరాజు, రేవతి, అనూరాధ పాడిన లలిత గీతాలు ఆకట్టుకున్నాయి.