Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలంగాణ-కల్చరల్ రిపోర్టర్
104 రోజులుగా తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఎబిసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విశ్వకళాయజ్ఞం హానర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదైనట్టుగా ప్రతినిధి విజయ తెలిపారు. శుక్రవారం ఆమె ఈ ప్రకటన చేస్తూ నమోదు పత్రాన్ని నిర్వాహకురాలు లలితారావు అందజేశారు. భారత్ వరల్డ్ రికార్డ్సు సీఈవో కేవీ రమణారావు, తెలంగాణా బీసీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వెంకటనారాయణ, కవి రఘుశ్రీ సభలో పాల్గొన్నారు. నాట్య గురువులు శ్రీవిద్య(కాళహస్తి), ప్రవీణ, భాగ్యలతల శిష్యురాండ్రు ప్రదర్శించిన బ్రహ్మాంజలి, నటనమాడెనే హరుడు, అన్నమయ్య కీర్తన బ్రహ్మమొక్కటే ఆకట్టుకున్నాయి.