Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఎల్అండ్టీ మహల్ మెట్రోభవన్ విదేశాల్లో పేరుగాంచిన స్మైలీ కిడ్డీస్ స్టేషనరీ షాప్ను తెలంగాణ ఐటీ, టెలీ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ శుక్రవారం ప్రారంభించారు. ఆయనతోపాటు రోటోమేకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత యాతం మాధవరెడ్డి హాజరయ్యారు. ముఖ్య అతిథులకు చిన్నపిల్లలు ఐశ్వర్య, ప్రియాంక స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా జయేశ్రంజన్ మాట్లాడుతూ దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో ఉన్న కిడ్డీస్ స్టేషనరీ స్టోరీ ఇప్పుడు హైదరాబాద్లో నెలకొల్పడం నూతన ఒరవడి అని తెలిపారు. ఉపయోగకర ఉత్పత్తులను సేకరించి వాటిని అందుబాటులో ఉండే అవకాశం కల్పిస్తూ పిల్లల్లో మనోవిజ్ఞాన కల్పనాశక్తి కల్పిస్తుందన్నారు. సీఈవో యాతం మాధవరెడ్డి అతిథులను సత్కరించారు.