Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ
టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ప్రకటించడం పట్ల ఓయూలో విడివిడిగా పలువురు సంబరాలు నిర్వహించారు. టీఎస్ జేఏసీ, బీసీ జేఏసీ నేత డాక్టర్ డి.బాలరాజ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. మరొక ఓయూ, టీఎస్ జేఏసీ నేతలు బండారి వీరబాబు, మందా సురేష్ల ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద బాణసంచాల కాల్చారు. అనంతరం డాక్టర్ బాలరాజ్, వీరబాబు, సురేష్, తుంగ బాబులు మాట్లాడుతూ కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ యువ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తుందని, ఈ రాష్ట్ర ప్రజల హక్కుల గొంతుక కేసీఆర్ అయితే, అభివృద్ధి మార్గదర్శి కేటీఆర్ అని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్కు అతిపెద్ద మెజారిటీతో కేసీఆర్ను 2వ సారి సీఎం చేసిన తెలంగాణ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కూటమిల పేరుతో ముందుకు వచ్చిన ప్రగతి వ్యతిరేఖ శక్తులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పటం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో పెర్కాశ్యామ్, ఎం.శ్రీనివాస్తో పాటు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ, టీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.