Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -జూబ్లీహిల్స్
శ్రీనగర్ కాలనీలోని ఎల్లారెడ్డిగూడలో రోడ్లపై డ్రెయినేజీ మురుగు నీరు మ్యాన్హోల్ పొంగి పొర్లుతున్నది. ఎన్నిసార్లు నాయకులకు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. దుర్వాసనతో ఇండ్లలో భోజనమూ చేయలేకపోతున్నామని, దోమలతో రోగాలపాలవుతున్నామని, స్కూలు పిల్లలు మురుగునీటిలోనే నడుస్తున్నారని తెలిపారు. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వెంటనే చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.