Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్ రూరల్
బీసీ ఓటర్ల గణనకు పలు గ్రామల్లో శుక్రవారం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో భాగంగానే ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం, వెంకటాపూర్, ఘణపూర్ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ఓటర్ లీస్టుల తప్పులను సరిచేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సునంద, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి ఉమాదేవి, నాయకులు బుర్ర వెంకటేష్, బండారి సుధాకర్, కార్యదర్శి మిస్బ ఆలం, నాయకులు వేముల సంజీవ గౌడ్, వేముల మహేష్ గౌడ్, నానావత్ రూప్ సింగ్ నాయక్, నానావత్ సురేష్ నాయక్, సత్తయ్య పాల్గొన్నారు.